హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రవ్యాప్తంగా 72 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు పౌరసరఫరాల శాఖ తెలిపింది. ఈ సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం సేకరణకు పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో 7,149 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలిపింది. సోమవారం వరకు 5,923 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్టు వెల్లడించింది. ఇప్పటి వరకు ఐదు జిల్లాల్లో 556 కొనుగోలు కేంద్రాల ద్వారా 10,325 మంది రైతుల నుంచి దాదాపు 72,071 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్టు పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు. ధాన్యం సేకరణ సందర్భంగా ఎలాంటి సమస్యలు తలెత్తినా 1967 లేదా 180042500333 టోల్ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని పౌరసరఫరాశాఖ అధికారులు తెలిపారు.