హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీని ఏర్పాటు చేసి, జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించిన పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్రావుకు పంజాబ్ సీఎం భగవంత్మాన్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్తో మాన్ మంగళవారం భేటీ అయ్యారు. దేశ రాజకీయ పరిస్థితులతోపాటు తెలంగాణ ప్రగతి, పంజాబ్ రాష్ట్ర పాలన తదితర అంశాలపై ఇరువురు సీఎంలు చర్చించారు.
అనంతరం భగవంత్ మాన్కు సీఎం కేసీఆర్ శాలువా కప్పి, జ్ఞాపికను బహూకరించారు. ఈ సమావేశంలో ఎంపీ సంతోష్ కుమార్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్, ఎమ్మెల్సీలు ఎస్ మధుసూదనాచారి, కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు బాల సుమన్, గువ్వల బాలరాజు, ఏ జీవన్రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్శర్మ, సీఎస్ సోమేశ్ కుమార్, సీఎం కార్యదర్శి భూపాల్రెడ్డి, మాజీ ఎంపీ ఎస్ వేణుగోపాలాచారి, సివిల్ సైప్లెస్ కార్పొరేషన్ చైర్మన్ రవీందర్ సింగ్, రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఈడిగ ఆంజనేయగౌడ్ తదితరులు పాల్గొన్నారు.