హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని కేజీబీవీల్లో తొలిసారిగా మాడ్యులర్ కిచెన్లను నిర్మించేందుకు సమగ్రశిక్ష ప్రాజెక్టు ఆమోదిత మండలి (పీఏబీ) ఆమోదం తెలిపింది. 280 కేజీబీవీల్లో ఒక్కోదానికి రూ.18.5 లక్షలు ఖర్చు చేయనున్నారు. ఇందుకోసం రూ.51.80 కోట్లను వెచ్చించనున్నారు. శుక్రవారం 202324 బడ్జెట్ ఆమోదానికి పీఏబీ సమావేశం శుక్రవారం వర్చువల్గా నిర్వహించారు. ఇందులో ఢిల్లీ నుంచి కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి సంజయ్కుమార్, రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వచ్చేవిద్యాసంవత్సరంలో సమగ్ర శిక్ష ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో 1,936 కోట్లను ఖర్చు చేయాలని నిర్ణయించారు. కేజీబీవీల్లో శుచి, శుభత్ర పాటించడంలో భాగంగా అధునాతన మాడ్యులర్ కిచెన్లను నిర్మిస్తారు. ఇప్పటికే తమిళనాడులో మాడ్యులర్ కిచెన్లను అధ్యయనం చేసిన రాష్ట్ర అధికారులు మన రాష్ట్రంలో కూడా వాటిని నిర్మించేందుకు ప్రతిపాదనలు రూపొందించగా, ఇందుకు కేంద్ర విద్యాశాఖ ఆమోదం తెలిపింది. షీ టీమ్స్ ద్వారా సైబర్ సెక్యూరిటీపై బాలికల్లో అవగాహన కల్పించడం, బడుల్లో మౌలిక వసతుల కల్పనకు చేపట్టిన ‘మన ఊరు మన బడి – మన బస్తీ మన బడి’కార్యక్రమాలపై కేంద్ర విద్యాశాఖ అధికారులు ప్రశంసించారు.