జోగులాంబ గద్వాల : అలంపూర్ (Alampur)పట్టణ కేంద్రంలోని శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి(Bala Brahmeswara Swamy) ఆలయాలను ఎమ్మెల్సీ చల్లా వెంకట్రాంరెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మహబూబ్నగర్ ఎమ్మెల్సీ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి గురువారం దర్శించుకున్నారు. అర్చకులు వారిని ఆలయ మర్యాదలతో ఆహ్వానించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి వారిని శేష వస్త్రాలతో సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. వారి వెంట బీఆర్ఎస్ స్థానిక నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.