హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): డాక్టర్ సీవీ నరసింహారెడ్డి ఫౌండేషన్, పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా (పీఆర్ఎస్ఐ) సంయుక్తంగా ఏటా అందజేసే ‘బెస్ట్ పీఆర్ మేనేజర్ ఆఫ్ ది ఇయర్-2023’ జాతీయ అవార్డుకు పబ్లిక్ రిలేషన్స్ అధికారి డాక్టర్ పందిరి హర్షభార్గవి ఎంపికయ్యారు. హైదరాబాద్లో ఈ నెల 6న నిర్వహించనున్న పీఆర్ ఎడ్యుకేషన్ డే సందర్భంగా ఆమెకు ఈ అవార్డను ప్రదానం చేయనున్నట్టు జ్యూరీ సభ్యులు తెలిపారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా మంత్రి హరీశ్రావు, కేవీ రమణాచారి హాజరుకానున్నారు. ప్రస్తుతం ఆమె అసిస్టెంట్ డైరెక్టర్ పీఆర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకొన్న ఆమె పీజీ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో గోల్డ్మెడల్ సాధించారు. మీడియా చట్టాలు, మానవ హకుల కోర్సుల్లో డిప్లొమా చేశారు. గతంలో రాష్ట్ర పోలీసు చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్గా, వికారాబాద్ డీపీఆర్వోగా, ఆగ్రికల్చర్ పీఆర్వోగా పనిచేశారు.