రంగారెడ్డి, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా కాలువల నిర్మాణానికి సంబంధించి పర్యావరణ అనుమతులపై మంగళవారం ప్రజాభిప్రాయం సేకరించనున్నారు. రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, నారాయణపేట, నల్లగొండ జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి, వికారాబాద్ జిల్లా పరిగి, నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ, నారాయణపేట, నల్లగొండలో ప్రజాభిప్రాయాలను సేకరిస్తారు. దాదాపు 12 వేల ఎకరాల సేకరణకుగాను పర్యావరణ అనుమతుల కోసం కాలువలు వెళ్లే ప్రాంతాల ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకుంటారు.