భైంసా, జూన్ 21: నిర్మల్ జిల్లా భైంసాలో జరిగిన అల్లర్లలో జైలుకు వెళ్లిన బాధిత కుటుంబ సభ్యులను సోమవారం పరామర్శించడానికి వెళ్లిన ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావ్, బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు పడకంటి రమాదేవికి పరాభవం ఎదురైంది. పరామర్శకు వెళ్లిన రమాదేవిని హిందూవాహిని కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆమె వెంట ఉంటే ఎవర్నీ పరామర్శించవద్దని నినాదాలు చేశారు. నాలుగు నెలలు గడిచినా గుర్తుకు రాలే దా?.. అంటూ ఎంపీ సోయం బాపురావ్ను నిలదీశారు. ‘మా పిల్లలు జైలులో ఉంటే వారిని విడిపించలేదు.. మీ రాజకీయ లబ్ధికోసం మా పిల్లల జీవితాలతో చెలగాటమాడుతారా?’ అంటూ మండిపడ్డారు.