Warangal | వరంగల్ చౌరస్తా : కాలిన గాయాలతో వరంగల్లోని ఎంజీఎం దవాఖానకు చేరుకున్న ఓ సైకో హల్చల్ చేశాడు. ఒంటి నిండా కాలిన గాయాలతో 108లో గురువారం ఎంజీఎంకు చేరుకున్న గుర్తుతెలియని వ్యక్తి చేష్టలతో సిబ్బంది భయాందోళనలకు గురయ్యారు.
చికిత్స అందిస్తుండగానే బయటకు పరుగులు తీశాడు. వెంబడించిన భద్రతా సిబ్బందిని దాటుకొని వెళ్లగా పోలీసులు తిరిగి తీసుకువచ్చారు. మళ్లీ తిరిగి వైద్యులు చికిత్స అందిస్తుండగానే నర్సింగ్ ఆఫీసర్ విశ్రాంత గదిలోకి దూరడానికి ప్రయత్నించడంతో సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. అనంతరం సదరు వ్యక్తిని తిరిగి క్యాజువాలిటీకి తరలించి ప్రత్యేకంగా భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసి చికిత్స అందించారు.