ఖమ్మం : గ్యాస్ ధరల పెంపునకు వ్యతిరేకంగా ఖమ్మం ధర్నా చౌక్లో బీఆర్ఎస్ శ్రేణులు పెద్దఎత్తున ధర్నా నిర్వహించాయి. మంత్రి పువ్వాడ అజయ్ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు నల్లజెండాలు, ఖాళీ సిలిండర్లతో నిరసన వ్యక్తంచేశారు. కట్టెల మోపులు నెత్తినపెట్టుకుని మహిళలు ధర్నాలో పాల్గొన్నారు.రాష్ట్ర రాజధానిలో కూడా ఆందోళనలు మిన్నంటాయి. హైదరాబాద్ ఫిలింనగర్ చౌరస్తాలో నిర్వహించిన ధర్నాలో ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు. ధర్నాలో మహిళలు భారీగా పాల్గొన్నారు. గ్యాస్ ధరలు తగ్గించాలని కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
శేరిలింగపల్లిలోని ఎల్లమ్మబండలో ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. మోదీ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి దహనం చేశారు.నల్లగొండ క్లాక్ టవర్ లో ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి మహా ధర్నాను ప్రారంభించారు. కుమ్రం భీం జిల్లా కేంద్రం లోని అంబేద్కర్ చౌక్ వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కోనేరు కోనప్ప, జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి, పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి నాగేశ్వరరావు, పలు మండలాల ఎంపీపీ, జడ్పీటీసీలు పాల్గొన్నారు.
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ గ్యాస్ సిలిండర్లతో మహా ధర్నా నిరసన కార్యక్రమం.. హైదరాబాద్ ఆల్విన్ కాలనీ డివిజన్లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎంపీ రంజిత్ రెడ్డి, విప్ ఆరెకపూడి గాంధీ తదితరులు పాల్గొన్నారు. కుత్బుల్లాపూర్ నియోజక వర్గం, ఐడీపీఎల్ చౌరస్తాలో రెండో రోజుప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి .
పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ నగరంలోని నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ చౌరస్తాలో ఎమ్మెల్యే గాలేరు వెంకటేష్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా దున్నపోతుకు వినతిపత్రం సమర్పించారు. మల్కాజిగిరి చౌరస్లా ఎమ్మెల్యే హనుమంతరావు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి.