గుమ్మడిదల, ఫిబ్రవరి 24: ప్యారానగర్లో జీహెచ్ఎంసీ డంపింగ్యార్డు ఏర్పాటును ప్రభుత్వం విరమించుకునే వరకు పోరాటాం ఆపమని జేఏసీ నాయకులు తేల్చిచెప్పారు. డంపింగ్యార్డు ఏర్పాటు పనులు ఆపాలంటూ గుమ్మడిదలలో రైతు, మహిళా జేఏసీ నాయకులు, అఖిలపక్ష నాయకులు కలిసి సోమవారం జాతీయరహదారిపై ర్యాలీ నిర్వహించా రు. అనంతరం తహసీల్ కార్యాలయానికి వెళ్లి నాయ బ్ తహసీల్దార్ కరుణాకర్రావుకు, ఆర్ఐ శ్రీనివాస్రెడ్డికి, మున్సిపల్ కమిషనర్ రఘుకు గులాబీపూలు అందజేసి డంపింగ్యార్డు అనుమతులు రద్దు చేయాలని విన్నవించారు. 20 రోజులుగా ఆందోళనలు చేస్తున్న అటు ప్రభుత్వం, ఇటు అధికారులు పట్టించుకోక పోవడంపై ఆందోళనకారులు ఆవేదన వ్యక్తం చేశారు.
గుమ్మిడిదలలో 20వ రోజు పద్మశాలీ సం ఘం సభ్యులు దీక్ష చేపట్టారు. నల్లవల్లి, కొత్తపల్లి గ్రామాల్లో 20వ రోజు రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. డంపింగ్యార్డుకు వ్యతిరేకంగా ఎలాంటి గొడవలు చేసినా తక్షణమే వారిని చెదరగొట్టడానికి భాష్పవాయువు ప్రయోగించడానికి దీక్ష శిబిరం వద్ద 207 వజ్రాగ్యాస్ వాహనాన్ని పోలీసులు సిద్ధంగా ఉంచారు. దీంతో జేఏసీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వం పై తీవ్రంగా మండిపడ్డారు. శాంతియుతంగా ఆందోళనలు చేస్తుంటే ప్రభుత్వం, అధికార యంత్రాంగం కాలుదువ్వడానికి యత్నించడం తగదని పేర్కొన్నా రు. వెంటనే భాష్ఫవాయువు వాహనాన్ని, పోలీస్ చెక్పోస్టులను తొలిగించాలని డిమాండ్ చేశారు.