నిజామాబాద్ : నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్కు బాల్కొండ నియోజకవర్గంలో పసుపు రైతుల నుంచి తీవ్ర నిరసన ఎదురైంది. ఎన్నికల్లో ఇచ్చిన మాట తప్పడంతో రైతులన నుంచి ఎంపీకి అడుగడుగున నిరసనల సెగ తగులుతున్నది. తాజాగా ఏర్గట్ల మండలంలోని తాళ రాంపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎదుట సోమవారం అరవింద్ ధర్మా తలపెట్టారు. ధర్నాకు వచ్చిన ఎంపీ అరవింద్ను పసుపు రైతులు అడ్డుకున్నారు. పసుపు బోర్డు హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఎంపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు.
ఎంపీ అరవింద్కు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎంపీ మద్దతుదారులు పసుపు రైతులు మధ్య ఘర్షణ ఏర్పడడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. ఒకదశలో ఇరువర్గాలు తోపులాటకు దిగారు.
ఇవి కూడా చదవండి..
దారుణం : భార్యను చంపి భర్త ఆత్మహత్య
పీవీకి సముచిత గౌరవం కల్పించిన సీఎం కేసీఆర్
పీవీకి ఘన నివాళులు అర్పించిన మంత్రి ఎర్రబెల్లి
హ్యాట్రిక్ గోల్డ్మెడల్స్.. ఆర్చరీ రికర్వ్లో వరల్డ్ నంబర్ వన్ దీపికా
సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం