కాలుష్య రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుదాం
ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి
హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): ప్రజల భాగస్వామ్యం, సమిష్టి బాధ్యతతోనే పర్యావరణ సమతుల్యత సాధ్యపడుతుందని అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయంలో సోమవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. వాయు కాలుష్యంపై రూపొందించిన షార్ట్ఫిల్మ్ను ఇంద్రకరణ్రెడ్డి ఆవిషరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించారు. వాతావరణ సమతుల్యతను కాపాడేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక కార్యక్రమాలు అమలుచేస్తున్నారని తెలిపారు. పౌరులు సామాజిక బాధ్యతతో వ్యవహరించడం ద్వారానే కాలుష్య రహిత రాష్ట్రంగా తీర్చుదిద్దుకోగలమని చెప్పారు. హరితహారం కార్యక్రమం ద్వారా ఏడు విడతల్లో 250 కోట్ల మొకలు నాటామని, 8వ విడతలో 19.54 కోట్ల మొక్కలు నాటాలన్నది లక్ష్యమని వెల్లడించారు.
అవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా దాదాపు 92 వేల కిలోమీటర్ల మేర మొకలను నాటినట్టు వివరించారు. పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో చైతన్యం పెంపొందించేందుకు పీసీబీ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అనంతరం రాష్ట్రంలో కాలుష్య నియంత్రణకు చేస్తున్న కృషికి గుర్తింపుగా ఇండియన్ ఇమ్యూనోలాజికల్ లిమిటెడ్, మేథ సర్వోడ్రైవ్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, బయోకాన్ పరిశ్రమల ప్రతినిధులకు పురసారాలను ప్రదానం చేశారు. పర్యావరణంపై నిర్వహించిన చిత్రలేఖనం పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. మొకజొన్న పిండితో తయారైన పర్యావరణ హిత సంచులను (క్యారీబ్యాగ్) ఆవిషరించారు. కార్యక్రమంలో ఈపీటీఆర్ఐ డైరెక్టర్ జనరల్ వాణీప్రసాద్, పీసీబీ సభ్య కార్యదర్శి నీతూకుమారిప్రసాద్, అప్పిలేట్ అథారిటీ చైర్మన్ ప్రకాశ్రావు, సభ్యుడు డాక్టర్ జయతీర్ధరావు, ఎస్ఈఏసీ చైర్మన్ కృష్ణారెడ్డి, పీసీబీ స్టాండింగ్ కౌన్సిల్కు చెందిన శివకుమార్, కార్పొరేటర్ లక్ష్మీబాల్రెడ్డి, సీఈ డీ రఘు, పీసీబీ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీవాత్సవ్, కార్యదర్శి కృపాకర్ తదితరులు పాల్గొన్నారు.