నిజామాబాద్ : నిజామాబాద్(Nizamabad) జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ మైదానంలో నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే(Namasthe telangana) సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రాపర్టీ షో(Property show) అట్టహాసంగా ప్రారంభమైంది. జిల్లా పరిషత్ చైర్మన్ విఠల్ రావు, నమస్తే తెలంగాణ జనరల్ మేనేజర్ సురేందర్ రావు కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
అనంతరం 23 స్టాళ్లను ముఖ్య అతిథిలు సందర్శించారు. ఒకే గొడుగు కింద ప్రముఖ నిర్మాణ రంగ కంపెనీలను బ్యాంకర్లను తీసుకురావడం అభినందనీయమని ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ విఠల్ రావు అన్నారు. నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే చేపట్టిన ప్రయత్నాన్ని కొనియాడారు.