నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ మైదానంలో నమస్తే తెలంగాణ , తెలంగాణ టుడే సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రాపర్టీ షో అట్టహాసంగా ప్రారంభమైంది. రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, నమస్తే తెలంగాణ – తెలంగాణ టుడే వైస్ ప్రెసిడెంట్ డి.చిరంజీవి , నమస్తే తెలంగాణ ఎడిటర్ తిగుళ్ల కృష్ణమూర్తి , నమస్తే తెలంగాణ ప్రకటనల విభాగం జనరల్ మేనేజర్ సురేందర్ రావు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.
హైదరాబాద్, నిజామాబాద్ ప్రాంతాలకు చెందిన బిల్డర్లు స్టాళ్లను ఏర్పాటు చేశారు. వీరికి తోడుగా జాతీయ బ్యాంకులు సైతం రుణ సదుపాయానికి సంబంధించిన వివరాలతో స్టాళ్లను ఏర్పాటు చేశారు. వినూత్న ఆలోచనతో నిజామాబాద్లో తొలిసారిగా ప్రాపర్టీ షో ఏర్పాటు చేయడం సంతోషకరమని మంత్రి వేముల కితాబు ఇచ్చారు.