హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): 1996 నుంచి 1998 మధ్యన రెండు యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాలు పడిపోయిన తరువాత, లోక్సభ రద్దయి, మధ్యంతర ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో బీజేపీ అన్ని పార్టీల కంటే అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది. ఆ కాలంలో భావసారూప్యత కలిగిన పార్టీలన్నీ బీజేపీలో కలిసి నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్గా ఏర్పడ్డాయి. వాజపేయి రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టాడు. 13 నెలల తరువాత సంకీర్ణంలో భాగస్వామి అయిన ఏఐఏడీఎంకే మద్దతు ఉపసంహరించుకోవడంతో వాజపేయి ప్రభుత్వం మెజార్టీని కోల్పోయింది. దీంతో ఆయన విశ్వాస పరీక్షను ఎదుర్కోవాల్సి వచ్చింది. 1999 ఏప్రిల్ 17న జరిగిన విశ్వాస పరీక్షలో కేవలం ఒక్క ఓటుతో ఓడిపోవడంతో ఆయన ప్రధాని పదవి వదులుకున్నారు. ఇదీ వాజపేయి నాటి బీజేపీ.
మరిప్పుడు.. దేశంలో బీజేపీలో రాజకీయ దిగజారుడుతనం పెరిగింది. స్వప్రయోజనాల కోసం ఉచ్చం నీచం వదిలేస్తున్నారు. దశాబ్దాల తరబడి అనుసరిస్తున్న సంప్రదాయాల్ని పకన పెట్టేస్తున్నారు. సిద్ధాంతాల్ని తుంగలో తొకేస్తున్నారు. కాషాయ పార్టీలో విలువలన్నీ ఆవిరయ్యాయి. ఎన్నికల్లో ప్రజలు తమకు మెజారిటీ ఇచ్చారా? లేదా? అనేది బీజేపీకి ముఖ్యం కాదు. ఎంతమంది ప్రజాప్రతినిధులను కొనుగోలు చేయగలమనేదే దానికి ముఖ్యం. ఒక్క సీటు గెలవకుండానే దొంగదారిలో, ప్రజాస్వామ్య విలువలకు నిలువునా పాతరవేస్తూ, ప్రజాస్వామ్య ప్రభుత్వాలను కూలగొడుతూ గద్దెను ఎక్కాలని చూస్తున్నది. అంగడి సరుకుల్లా ప్రజాప్రతినిధులను కొంటూ, బేరసారాలు నడిపిస్తూ, పదవులను ఆశ జూపుతూ, వేల కోట్ల కాంట్రాక్టులను ఎరవేస్తూ అడ్డదారిన అందలం ఎక్కేందుకు నేడు ఆ పార్టీ పాల్పడుతున్న ఆకృత్యాలను, చేస్తున్న నీచ రాజకీయాలను చూస్తూ నాటితరం బీజేపీ నేతలే చీదరించుకుంటున్నారు. ఎమ్మెల్యేల సంఖ్యను ఏదోరకంగా పెంచుకోవడం, ఆ తరువాత అధికారాన్ని హస్తగతం చేసుకోవడం ఒక రాజకీయ ప్రక్రియగా బీజేపీకి మారింది. అధికారమే పరమావధిగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం అత్యంత సహజమైందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. కొడిగడుతున్న పార్టీ విలువలను చూస్తూ లోలోన మథనపడుతున్న దుస్థితి నెలకొందని పలువురు బీజేపీ శ్రేణులే బాహాటంగా చెప్పుకొంటున్నారు.
అంధ్రుల ఆత్మాభిమానమే నినాదంగా ఎన్టీఆర్ టీడీపీని స్థాపించి, 9 నెలలకే ప్రభుత్వం ఏర్పాటు చేయడం చరిత్ర. అశేష ప్రజాభిమానంతో ముఖ్యమంత్రి పదవిని అలంకరించిన ఎన్టీఆర్ను, ఆయన మంత్రి వర్గంలోని నాదెండ్ల భాసరరావు వెన్నుపోటు పొడిచి, కాంగ్రెస్తో కుమ్మక్కయి అడ్డదారిన ముఖ్యమంత్రి అయ్యాడు. తరువాత నెల రోజులకు ఎంతో డబ్బు ఖర్చుపెట్టినా శాసనసభలో మద్దతు కూడగట్టుకోలేకపోయాడు. ఫలితంగా భాసరరావు ముఖ్యమంత్రి పీఠం దిగిపోవాల్సి వచ్చింది. అంతే కాదు వెన్నుపోటు దారుగా భాస్కర్రావును ప్రజలు ఛీత్కరించుకోవడంతోపాటు, రాజకీయ ఉనికే లేకుండా చేశారు. ఇదీ వెన్నుపోటుదారులకు, అడ్డదారుల్లో అందలం ఎక్కే నేతలకు గుణపాఠంగా మిగిలిపోయింది. కానీ నేడు బీజేపీ సర్కారు హయాంలో పరిస్థితి పూర్తిగా తారుమారయింది.
ఇప్పుడు వెన్నుపోటుదారులను స్వయం గా కేంద్రంలోని బీజేపీ సర్కారే ప్రోత్సహిస్తున్నది. షిండేలనే హీరోలుగా ప్రచారం చేస్తూ, ప్రజాస్వామ్య ప్రభుత్వాలను కూల్చే కుట్రలకు తెరలేపడం సిగ్గుచేటు. ఇప్పుడు ముసుగులో గుద్దులాటల్లేవు. గెలవాలి. ఎలాగైనా గెలవాలి. ఏక్నాథ్ షిండేలే ఇప్పుడొక ఆదర్శం. ఇదే ఆమోదయోగ్యమైన పద్ధతిగా బీజేపీ నేతలే ప్రచారం చేస్తున్నారు. ఏక్నాథ్లను విజయ సంకేతంగా అభివర్ణిస్తున్నారు. వంచన ఇప్పుడు నింద కాదు. మోసం ఇప్పుడు అగౌరవం కాదు. వెన్నుపోటు ఇప్పుడు తప్పు కాదని చాటుతుండడం బీజేపీ దిగుజారుడుతనానికి తార్కాణంగా నిలుస్తున్నది. ఏక్నాథ్లను తామే పుట్టించామని నిస్సిగ్గుతో చెప్పుకోవాలి, ఎకడెకడ చోటు దొరకదో అకడకడ ఏక్నాథ్లను పుట్టిస్తామని ఒక బహిరంగ విజయరహస్యంగా సూత్రీకరించడం కాషాయ పార్టీ కల్తీ రాజకీయాలకు దర్పణం పడుతున్నది. రాష్ట్రాల్లోని ప్రతిపక్ష పార్టీలను, ప్రభుత్వాలను పతనం చేసేందుకు బీజేపీ సామ, దాన, భేద, దండోపాయాలను ఉపయోగిస్తున్నది.
సీఎం కేసీఆర్కు దేశవ్యాప్తంగా లభిస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక మోదీ, అమిత్షా తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రకు తెరలేపారు. మోదీ, అమిత్ షా ఆటలు తెలంగాణలో సాగవని హెచ్చరించారు. అమ్ముడు పోయి మునుగోడు ఎన్నిక తెచ్చిన రాజగోపాల్రెడ్డి లాగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అమ్ముడుపోరు. వారు ఉద్యమకారులు.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిఖార్సైన తెలంగాణ బిడ్డలు. అక్రమంగా సంపాదించిన సొమ్ముతో ప్రభుత్వాలను కూలదోస్తున్న బీజేపీకి తగినశాస్తి జరుగుతుంది.
– మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి
బీజేపీ ఎలాంటి విలువలు లేకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నది. టీఆర్ఎస్ను ఎలాగైనా దెబ్బకొట్టాలనే దురాలోచనతో అడ్డదార్లు ఎంచుకున్నది. సిగ్గు,ఎగ్గు లేకుండా ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నించింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అమ్ముడుపోయే రకంకాదు. కేసీఆర్ ముందు మోదీ, అమిత్షా ఆటలు సాగవు. మునుగోడులో బీజేపీని బొందపెట్టాలి. బీజేపీ ఢిల్లీ పీఠం బద్దలు కావడం ఖాయం.
-మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి
సీఎం కేసీఆర్కు దేశవ్యాప్తంగా వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే బీజేపీ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నది. బీజేపీ ప్రలోభాలకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లొంగరు. మోదీ, అమిత్షా ఆటలు తెలంగాణలో సాగవు. రాజగోపాల్రెడ్డి మాదిరి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అమ్ముడుపోరు. బీజేపీ కుట్ర రాజకీయాలు చేస్తున్నదని మొదటి నుంచి చెప్తున్నాం.
-మంత్రి కొప్పుల ఈశ్వర్
బీజేపీకి రాజ్యాంగం పట్ల ఏ మాత్రం గౌరవం లేదు. కేసీఆర్ అపర చాణక్యుడని, తెలంగాణలో బీజేపీ చిల్లరమల్లర రాజకీయాలు చెల్లవు. దేశ రాజకీయాలను బీజేపీ భ్రష్టు పట్టిస్తున్నది. కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల ప్రభుత్వాలను కూల్చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన నీచ చరిత్ర బీజేపీకి దక్కింది. మునుగోడు ఎన్నికల్లో బీజేపీ డిపాజిట్ కోల్పోవడం, టీఆర్ఎస్ ఘన విజయం సాధించి తీరటం తథ్యం.
-రాజ్యసభ సభ్యుడు రవిచంద్ర
ఫామ్హౌజ్లో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు నేరుగా పీఠాధిపతులు, మఠాధిపతులు రంగంలోకి దిగి పోలీసులకు పట్టుబడటం దేశ రాజకీయాలను బీజేపీ భ్రష్టు పట్టిస్తున్న తీరుకు అద్దం పడుతున్నది. మునుగోడు ఉపఎన్నికలో ఎలాగైనా గెలవాలని బీజేపీ ప్రయత్నిస్తున్నది, కానీ మూడో స్థానానికే పరిమితమవుతుందని తెలిసి బీజేపీ పెద్దలు ఢిల్లీ నుంచి నేరుగా వందల కోట్ల డబ్బును మఠాధిపతులు, పీఠాధిపతులతో దిగుమతి చేయడం ద్వారా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే స్థాయికి దిగజారారు. ఈ కుట్రలో పీఠాధిపతులు, మఠాధిపతులు కన్పిస్తున్నప్పటికీ… వెనుక ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఉన్నారా? లేక ఇంకా ఎంతమంది ఉన్నారో వెల్లడికావాల్సి ఉన్నది.
-సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు