హనుమకొండ చౌరస్తా,ములుగు, మార్చి 7: కాకతీయుల కాలం నాటి వేయిస్తంభాల దేవాలయ కల్యాణ మండపాన్ని పునః ప్రారంభించేందుకు కేంద్ర పురావస్తుశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. శుక్రవారం మహాశివరాత్రిని పురస్కరించుకుని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్ర పురావస్తుశాఖ 2005లో పునర్నిర్మాణమనే మహాఘట్టానికి శ్రీకారం చుట్టింది. పునరుద్ధరణకు మొత్తం రూ.15 కోట్లు వెచ్చించి పనులు పూర్తిచేశారు. శుక్రవారం ఉదయం 6 గంటలకు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి.. రాష్ట్ర మంత్రులు జూపల్లి , పొంగులేటి ్డ, కొండా సురేఖ, సీతక్క, పొన్నం ప్రభాకర్, స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డితో కలిసి ప్రారంభించనున్నారు.
ములుగులో ఏర్పాటు కానున్న గిరిజన యూనివర్సిటీ తాత్కాలిక క్యాంపస్ను శుక్రవారం కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, రాష్ట్ర మంత్రి సీతక్కతో కలిసి ప్రారంభించనున్నారు. అందుకు తగిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆధ్వర్యంలో అధికారులు పూర్తి చేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం గిరిజన యూనివర్సిటీ భూములను కేంద్ర ప్రభుత్వానికి అప్పగించగా ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల మహబూబ్నగర్ జిల్లాలో జరిగిన బహిరంగ సభలో మేడారం సమ్మక్క సారలమ్మ పేరుతో వర్సిటీని నిర్మించనున్నట్టు స్పష్టం చేశారు. ములుగులో రూ.889.07 కోట్ల నిధులతో ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నారు.