హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ) : ఐఐటీ హైదరాబాద్ ఆచార్యుడు ప్రొఫెసర్ కీర్తి చంద్రసాహు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. ఉన్నత విద్య క్యాటగిరీలో ఆయన్ను ఎంపికచేసినట్టు కేంద్ర విద్యాశాఖ సోమవారం ప్రకటించింది.
2026 విద్యాసంవత్సరానికి ఈ కోటాలో 21 మందికి అవార్డులు దక్కగా, తెలంగాణ నుంచి కీర్తి చంద్రసాహు అవార్డు దక్కించుకున్నారు. పాఠశాల విద్యలో బొంపెల్లి భవాని ఈ అవార్డుకు ఎంపికైన విషయం తెలిసిందే.