హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): క్రిమినల్ కేసులు విచారణలో ఉండగా నిందితుడు విదేశాలకు వెళ్లేందుకు నిర్దిష్ట కాలానికి పాస్ పోర్టు జారీ చేయవచ్చని హైకోర్టు తీర్పు చెప్పింది. 1993 నోటిఫికేషన్ ప్రకారం క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నప్పుడు సంబంధిత కోర్టు సూచనపై నిందితుడికి పాస్పోర్టు జారీ చేయవచ్చని జస్టిస్ కే సురేందర్ ధర్మాసనం స్పష్టంచేసింది. అమెరికాలో ఉన్న తన కుమార్తె ఎంఎస్ డిగ్రీ పట్టా స్వీకరణ కార్యక్రమానికి వెళ్లేందుకు పాస్పోర్టు కోసం దరఖాస్తు చేసుకొంటే అధికారులు తిరసరించటాన్ని సవాల్ చేస్తూ కే రేవతి దాఖలుచేసిన పిటిషన్ను విచారించిన న్యాయస్థానం, రెండేండ్ల గడువుతో పాస్పోర్టు జారీ చేయాలని పాస్పోర్టు అధికారులను ఆదేశించింది. పాస్పోర్టును సంబంధిత కోర్టులో సమర్పించాలని, విదేశాలకు వెళ్లే ముందు పాస్పోర్టు కోసం పిటిషనర్ కోర్టుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దరఖాస్తు చేసుకొన్న రెండు రోజుల్లో కింది కోర్టు దానిని పరిషరించాలని ఆదేశిస్తూ విచారణను ముగించింది.