కరీంనగర్ : కలిసి ఉంటే కలదు సుఖం అన్నట్లు సంఘంలోని వ్యక్తులందరూ కలిసి ఉంటే సమస్యలు పరిష్కారమవుతాయని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ మున్నూరు కాపు ఉద్యోగ విశ్రాంతి ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా శాఖ నూతన కార్యవర్గ సభ్యులు ఆదివారం మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్నూరు కాపులు సమాజంలోని వివిధ రంగాల్లో ఉద్యోగులుగా రాణిస్తూ సమాజాభివృద్ధికి కృషి చేస్తున్నారని ప్రశంసించారు. సంఘటితంగా ఉండడం వల్ల సమాజానికి కూడాఉపయోగం ఉంటుందని అభిప్రాయపడ్డారు. సంఘం అభివృద్ధికి సహకారం అందిస్తానని అన్నారు. మంత్రిని కలిసిన వారిలో జిల్లా అధ్యక్షులు వీర బుచ్చయ్య, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు మామిడి రమేశ్ పటేల్, జిల్లా ప్రధాన కార్యదర్శి కామ సతీష్ పటేల్, కోశాధికారి బట్టు కరుణాకర్ పటేల్, సహాధ్యక్షులు గాదె నాగులు పటేల్ తదితరులు పాల్గొన్నారు.