TSRTC |హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా ప్రయాణికుల కోసం టీఎస్ఆర్టీసీ ప్రకటించిన లక్కీడ్రా బుధవారం నుంచి ప్రారంభం కానున్నది. ఈ నెల 30 వరకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించిన వారికి నగదు బహుమతులు గెలుచుకునే అవకాశం కల్పించింది.
ఈ లక్కీ డ్రాలో గెలుపొందిన ప్రయాణికులకు రూ.11 లక్షల నగడు బహుమతులను సంస్థ అందిస్తుందని అధికారులు వెల్లడించారు. ప్రయాణికులు టికెట్ వెనుక తమ పేరు, ఫోన్ నంబర్ను రాసి, బస్టాండ్లలో ఏర్పాటుచేసిన డ్రాప్ బాక్సుల్లో వేయాలని ప్రయాణికులకు సూచించారు.