అధిక ఫీజులు వసూళ్లపై వైద్యారోగ్య శాఖ కొరడా
రూ.1.61 కోట్లు తిరిగిచ్చేసిన 44 దవాఖానలు
ఆర్టీఐ ద్వారా వెల్లడి
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 25 (నమస్తే తెలంగాణ): కరోనా సమయంలో రోగుల నుంచి అధిక ఫీజులు వసూలు చేసిన దవాఖానల నిర్వాహకులు ఆ డబ్బును రోగులకు తిరిగి ఇచ్చేస్తున్నారు. ఇప్పటి వరకు 44 దవాఖానలు రూ.1.61 కోట్లు రోగులకు తిరిగి ఇచ్చినట్టు ఆర్టీఐ ద్వారా తెలిసింది. కొవిడ్ రోగుల నుంచి ఇష్టారాజ్యంగా అధిక ఫీజులు వసూలు చేసినట్టు అందిన 174 ఫిర్యాదులపై ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ అధికారులు విచారణ జరిపారు. కొన్ని దవాఖానలు అధిక ఫీజులు వసూలు చేసినట్టు తేలటంతో 139 దవాఖానలకు షోకాజ్ నోటీసులు ఇచ్చి, 22 దవాఖానల లైసెన్స్లను రద్దు చేసినట్టు ఆర్టీఐ ద్వారా తెలిసింది. 44 దవాఖానలు 2021 జూన్ 22 నాటికి రూ.1,61,22 484 తిరిగి ఇచ్చేసినట్టు వెల్లడైంది.
అధిక ఫీజులు వాపస్ ఇచ్చిన హాస్పిటల్స్:
5 లక్షలు- 10 లక్షల మధ్య తిరిగి చెల్లించిన దవాఖానలు:
ఎల్బీనగర్లోని అంకుర్ హాస్పిటల్, కూకట్పల్లిలోని ప్రతిమ హాస్పిటల్, ఎల్బీనగర్లోని దివ్య హాస్పిటల్, సచివాలయం ప్రాంతంలోని మెడికవర్ హాస్పిటల్, ఆర్సీపురంలోని ఎన్కేర్ హాస్పిటల్, హైటెక్సిటీలోని కేర్ హాస్పిటల్, బషీర్బాగ్లోని హైదరాబాద్ నర్సింగ్హోమ్, గచ్చిబౌలిలోని సన్షైన్ హాస్పిటల్.
మరిన్ని దవాఖానలు