జనగామ: జనగామ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. జిల్లాలోని నెల్లుట్ల వద్ద ఓ ప్రైవేటు బస్సు ప్రమాదవశాత్తు దగ్ధమయింది. ఛత్తీస్ఘడ్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సు ఇంజన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి బస్సు మొత్తానికి వ్యాపించడంతో పూర్తిగా దగ్ధమయింది. అయితే ఇంజన్లో పొగ రావడాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమయ్యాడు. దీంతో బస్సులో సుమారు 26 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.