కరీంనగర్ కమాన్చౌరస్తా, ఏప్రిల్ 29: అర్చకులు ఐక్యంగా ముందుకు సాగుతూ తమ హకులను సాధించుకోవాలని అర్చక సమాఖ్య రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ పిలుపునిచ్చారు. శుక్రవారం కరీంనగర్లో నిర్వహించిన ధూప దీప నైవేద్య (డీడీఎన్) అర్చక సమాఖ్య రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు.
గతంలో 3,440 ఆలయాలకు నెలకు రూ.6 వేల గౌరవ భృతి అందిస్తుండగా, ఈ నెలలో మరో 2,880 ఆలయాలను డీడీఎన్కు ఎంపిక చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం పట్ల హర్షం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో దేవాదాయశాఖ పరిధిలో 12,625 ఆలయాలు ఉండగా గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్లో కేటీఆర్ చొరవతో 1,720 ఆలయాలకు ఈ పథకం అందించడానికి నోటిఫికేషన్ వచ్చిందన్నారు. ఈ సమావేశంలో డీడీఎన్ ఆలయాల సంఘం వరింగ్ ప్రెసిడెంట్ పెన్నా మోహనశర్మ, రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.