భైంసా/జమ్మికుంట రూరల్, జనవరి 20: ఈ సారి పత్తి ధర రికార్డు స్థాయిలో పలుకుతున్నది. గురువారం నిర్మల్ జిల్లా భైంసా మార్కెట్లో క్వింటాల్ పత్తి ధర రూ.10,100, కరీంనగర్ జిల్లా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో రూ. 10 వేలు పలికింది. ధర ఆశాజనకంగా ఉండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా జమ్మికుంట మార్కెట్లో ఏఎంసీ చైర్మన్ వాల బాలకిషన్రావు ఆధ్వర్యంలో రైతులు కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకొన్నారు.