President Murmu | హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము నేడు నగరానికి రానున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో సాయంత్రం 5.30 గంటల నుంచి 6.45 వరకు ఆంక్షలు విధించారు.
హాకీంపేట్ ఎయిర్ఫోర్స్ స్టేషన్ జంక్షన్, బొల్లారం చెక్పోస్టు, నెవీ జంక్షన్, యాప్రాల్ రోడ్డు, హెలిప్యాడ్ వైజంక్షన్, బైసన్ గేట్, లోతుకుంట టీ జంక్షన్లు మూసేస్తున్నట్టు నగర ట్రాఫిక్ డీసీపీ తెలిపారు. ఈ సందర్భంగా ఆయా రూట్లలో వెళ్లే వారు ప్రత్యామ్నాయ దారుల్లో వెళ్లాలని సూచించారు.