హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ): ప్రస్తుతం రాష్ట్రంలో 3.6 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. కొత్తగా 8 లక్షల మంది ఓటర్లుగా నమోదయ్యారు. ఎన్నారై ఓటర్లు భారీగా పెరిగారు. 2014లో కేవలం ఐదుగురే ఎన్నారై ఓటర్లు ఉండగా.. 2018లో ఈ సంఖ్య 244కి, ఇప్పుడు ఏకంగా 2,780కి చేరింది. వీరిలో 2,248 మంది పురుషులు, 531 మంది మహిళలు, ఒక ట్రాన్స్జెండర్ ఉన్నారు.
రాష్ట్రంలో బోథ్, నారాయణఖేడ్ మినహా మిగతా 117 నియోజకవర్గాల్లో ఎన్నారై ఓటర్లు ఉన్నారు. అత్యధికంగా 206 మంది ఎన్నారై ఓటర్లతో మల్కాజిగిరి నియోజకవర్గం అగ్రస్థానంలో నిలువగా.. ఆ తర్వాతి స్థానాల్లో ఉప్పల్ (131), కూకట్పల్లి (102) ఉన్నాయి. 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకరు చొప్పున ఎన్నారై ఓటర్లు ఉన్నారు.