హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ) : ఏడాదిన్నరలో తెలంగాణ అగ్నిమాపక శాఖ 890 మంది ప్రాణాలను కాపాడిందని ఆ శాఖ ఏడీజీ వై నాగిరెడ్డి వెల్లడించారు. ఈ వానకాలంలో వరదల్లో చిక్కుకుపోయిన పౌరులను కాపాడేందుకు రాష్ట్రవ్యాప్తంగా సుశిక్షతులైన 149 మంది సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
శుక్రవారం హుస్సేన్సాగర్ తీరంలో శిక్షణ పొందిన 20 మంది ఫైర్మెన్లతో ‘వాటర్ రెస్యూ ఆపరేషన్స్ రిఫ్రెషన్ ట్రైనింగ్’ కార్యక్రమాన్ని హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జితేందర్, ప్రభుత్వ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఏడీజీ వై నాగిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏడీజీ మాట్లాడుతూ.. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో సుమారుగా 30 మందికి శిక్షణ ఇచ్చినట్టు తెలిపారు. ప్రతి శుక్రవారం వాటర్ రెస్క్యూ సిబ్బంది ప్రాక్టీస్ చేస్తుందని తెలిపారు.