హైదరాబాద్ : బంజారాలు, ఆదివాసీల ఆత్మగౌరవ ప్రతీకలు బంజారా, ఆదివాసీ భవనాలు. నగరం నడిబొడ్డున బంజారాహిల్స్లో నిర్మిస్తున్న బంజారా, ఆదివాసీ భవనాల నిర్మాణ పనులు.. ఈ నెల 15లోపు పూర్తి చేయాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు.
గురువారం గిరిజన సంక్షేమ శాఖ చీఫ్ ఇంజినీర్ శంకర్, ఇతర ఇంజినీర్ అధికారులతో కలిసి మంత్రి భవన నిర్మాణాల పనులపై సమీక్షించారు. ఇప్పటికే దాదాపుగా భవనాల నిర్మాణం పూర్తి అయిందని అధికారులు వివరించారు.
ఈ నెల 15 తర్వాత ఎపుడైనా భవనాలను ప్రారంభించుకునే విధంగా ఏ ఒక్క పని పెండింగ్ లేకుండా సంపూర్ణంగా పనులు చేయాలన్నారు.
ఈ భవన నిర్మాణాలను సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్మాణ పనులు ఉండాలని, నిర్లక్షం వహించవద్దని మంత్రి అధికారులను ఆదేశించారు.
ఇవి కూడా చదవండి..
మైనర్ వివాహాన్ని అడ్డుకున్న పోలీసులు
అంబులెన్స్లోనే కరోనా గర్భిణి ప్రసవం
సీఎం కేసీఆర్ వెంటే మంథని ప్రజలు
అజిత్ సింగ్ మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం
కరోనా కష్టకాలంలో రైతులను ఆదుకుంటున్న ప్రభుత్వం