హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): మోడల్ స్కూళ్ల బోధనాసిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు పెంచింది. వీరికి 30% పీఆర్సీ వర్తింపజేస్తూ, నూతన పేస్కేల్ను ఖరారుచేస్తూ విద్యాశాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా శుక్రవారం జీ వో జారీచేశారు. తెలంగాణ మోడల్ స్కూల్ సెకండరీ ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా రా ష్ట్రంలోని 194 మోడల్ స్కూళ్లో 3 వేల వర కు బోధనాసిబ్బంది పనిచేస్తున్నారు. తెలంగాణ రాకముందు మోడల్ స్కూల్స్ ప్రిన్సిపాళ్లకు రూ.20,680 – 46,960, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లకు రూ.16,150 – 42,590, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లకు రూ.14,860 – 39,540 పేస్కేల్ను అమలుచేశారు. 2015 పీఆర్సీలో భాగంగా తెలంగాణ సర్కారు వీరివేతనాలను గణనీయంగా పెంచింది. తాజా గా 2020 పీఆర్సీని వర్తింపజేసి, నూతన వేతనాల అమలుకు జీవో జారీచేసింది. వేతనాల పెంపుపై ఉపాధ్యా య ఎమ్మెల్సీలు కాటేపల్లి జనార్దన్రెడ్డి, కూర రఘోత్తంరెడ్డి, పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షప్రధాన కార్యదర్శులు పింగిలి శ్రీపాల్రెడ్డి, బీరెల్లి కమలాకర్రావు, పీఎంటీఏ -టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు తరాల జగదీశ్, ప్రధాన కార్యదర్శి అనుముల పోచయ్య, శ్రీ నివాస్, శేఖర్, తెలంగాణ మోడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు భూతం యాకమల్లు, ప్రధాన కార్యదర్శి కొంతం నగేశ్ హర్షం వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్రావు, సబితాఇంద్రారెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.
పేస్కేల్ ఇలా..
పోస్టు 2015 పీఆర్సీ 2020 పీఆర్సీ
ప్రిన్సిపాల్ రూ.40,270 – 93,780 రూ.58,850 – 1,37,050
పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ రూ.31,460 – 84,970 రూ.45,960 -1,24,150
ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ రూ. 28,940 -78,910 రూ. 42,300 -1,15,270