నాంపల్లి కోర్టులు, మార్చి 26 (నమస్తే తెలంగాణ): స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్రావును మరో 5 రోజులపాటు తమ కస్టడీకి ఇవ్వాలని పంజాగుట్ట పోలీసులు కోరారు. ఈ మేరకు మంగళవారం నాంపల్లిలోని 14వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రణీత్రావుతోపాటు మాజీ ఏఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను సైతం 5 రోజుల కస్టడీకి అప్పగించాలని ఆ పిటిషన్లో విజ్ఞప్తి చేశారు. దీంతో నిందితుల తరఫు న్యాయవాదికి మేజిస్ట్రేట్ కన్నయ్యలాల్ నోటీసులు జారీ చేయడంతో.. కౌంటర్ దాఖలుకు సమయం ఇవ్వాలని కోరారు. బుధవారం కౌంటర్ దాఖలు చేయడంతోపాటు వాదనలను త్వరగా పూర్తి చేయాలని మెజిస్ట్రేట్ స్పష్టం చేశారు.