హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ)/చిక్కడపల్లి: కార్పొరేట్ శక్తులు వ్యవసాయరంగంలో ప్రవేశించకుండా పోరాడాల్సిన అవసరం ఉన్నదని ప్రముఖ ఆర్థిక, రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ ప్రభాత్ పట్నాయక్ పిలుపునిచ్చారు. వ్యవసాయా న్ని సరుకుగా మార్చడమే లక్ష్యంగా సామ్రాజ్యవాదులు ప్రయత్నాలు చేస్తున్నారని, కేంద్రం అందుకు అనుగుణంగానే మూడు వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చిందని చెప్పారు. దేశానికి ఆ చట్టాల ప్రమాదం ఇంకా పొంచి ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు.
‘మారుతున్న ప్రపంచ సంబంధాలు, వాతావరణం, వ్యవసాయ జాతీయ విధానం, వానాకాలం పంటల సాగు’పై మంగళవారం హైదరాబాద్లోని ఎస్వీకేలో నిర్వహించిన రాష్ట్ర సదస్సులో ప్రభాత్ మాట్లాడుతూ.. రైతు రక్షణకు అప్రమత్తత అవసరమని చెప్పారు. ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ అరిబండి ప్రసాదరావు అధ్యక్షతన నిర్వహించిన సదస్సులో అఖిల భారత కిసాన్సభ జాతీ య ప్రధానకార్యదర్శి విజోకృష్ణన్, వ్యవసాయరంగ నిపుణుడు అల్ధాస్ జాన య్య, వ్యవసాయ వర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ రాజిరెడ్డి, ఏఐకేఎస్ జాతీయ నాయకుడు సారంపల్లి మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.