నాంపల్లి కోర్టులు, మే 8 (నమస్తే తెలంగాణ): ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో ఎలాంటి కుట్రలకు పాల్పడలేదని, విచారణలో భాగంగా దర్యాప్తు అధికారులకు అన్నివిధాలా సహకరిస్తానని అమెరికాలో ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావు కోర్టుకు తెలిపారు. ఇటీవల పంజాగుట్ట పోలీసులు ప్రభాకర్రావుపై నాన్బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలని న్యాయస్థానంలో పిటిషన్ వేయగా, దీనిపై వాదనలు జరిగాయి. గురువారం తీర్పు వెలువడే అవకాశాలున్నాయి.
ఈ నేపథ్యంలోనే ప్రభాకర్రావు తరఫున న్యాయవాది కోర్టులో బుధవారం పిటిషన్ దాఖలు చేశారు. అమెరికాలో వైద్య చికిత్స పొందుతున్నారని, ఈ విషయం ఇప్పటికే దర్యాప్తు అధికారుల దృష్టిలో ఉన్నదని, ఫోన్ ద్వారా అందుబాటులో ఉంటానని చెప్పాడని, చికిత్స పూర్తయిన వెంటనే వస్తానన్నారని, వారెంట్ జారీ చేయవద్దని న్యాయవాది కోరారు. 73 సీఆర్పీసీ ప్రకారం ఆయనకు వారెంట్ జారీ చేయవద్దని కోరారు.
అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రభాకర్రావుకు కొవిడ్ సోకడంతో గొంతు, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు తీవ్రమయ్యాయయని కోర్టు దృష్టికి తెచ్చారు. అందుకు తన సోదరుడి వద్దకు వెళ్లి వైద్య చికిత్స కోసం ఈ ఏడాది ఫిబ్రవరి 15వ తేదీన వెళ్లారని తిరిగి రావడానికి జూన్ 26వ తేదీకి టికెట్లు బుక్ చేసుకున్నారని కోర్డుకు తెలిపారు. ఆయనకు సంబంధించి వివరాలను కుటుంబసభ్యులు అందించి, సహకరిస్తున్నారని, వారిని వేధించవద్దని కోరారు. ప్రభాకర్రావుకు ప్రతిభ ఆధారంగానే ఎస్ఐబీ చీఫ్గా బాధ్యతలు ఇచ్చారని, కుల ప్రతిపాదికన కాదని వివరించారు.