న్యూఢిల్లీ, మార్చి 10 (నమస్తే తెలంగాణ) : ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ చీఫ్ టీ ప్రభాకర్రావుకు ఊరట లభించింది. ఈ కేసులో ఆయనను అరెస్టు చేసిన పక్షంలో రూ.25 వేల చొప్పున 2 పూచీకత్తులతో విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్ మహాదేవన్ ధర్మాసనం మంగళవారం కీలక ఉత్తర్వులు జారీచేసింది.
ఈ కేసులో ప్రభాకర్రావుకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించడంతో ఆయన నిరుడు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ అప్పీల్పై విచారణ జరిపిన ధర్మాసనం.. గతంలో కల్పించిన తాతాలిక రక్షణను ఖరారు చేస్తూ పిటిషన్ పరిషారమైనట్టు ప్రకటించింది. షరతులను ఉల్లంఘిస్తే ముందస్తు బెయిల్ను వెంటనే రద్దుచేసే అవకాశం ఉన్నదని హెచ్చరించింది.