హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో హెచ్ఎండీఏకు చెందిన 200 ఎకరాల ‘పైగా’ భూముల వివాదంపై హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది. ఆ భూములను ‘పైగా’ కుటుంబసభ్యుల నుంచి తమ పూర్వీకులు కొనుగోలు చేశారని, ఇందు లో అధికారులు, పోలీసులు జోక్యం చేసుకోకుండా ఆదేశాలివ్వాలని కోరుతూ ఫలక్నుమా వాసి యాహిరా ఖురేషి, వట్టేపల్లికి చెందిన మహ్మద్ మొయినుద్దీన్ దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు సీజే జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్కుమార్ ధర్మాసనం శనివారం మరోసారి విచారణ చేపట్టింది.
ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. ఈ భూములకు సంబంధించి గతంలో కోర్టు తీర్పులు ఇచ్చినట్టు పిటిషనర్లు తప్పుడు పత్రా లు సృష్టించారని తెలిపారు. లేని తీర్పులను ఉన్నట్టు చూపి ఏకంగా కోర్టునే మోసగించేందుకు ప్రయత్నించిన పిటిషనర్లపై చర్యలు తీసుకోవారని కోరారు. ఒకవేళ ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయించదలిస్తే ఐపీఎస్ అధికారి అవినాశ్ మహంతి సహకరించగలరని పేర్కొన్నారు. దీనిపై పిటిషనర్ల తరపు న్యాయవాది స్పంది స్తూ.. ఆ భూములను ‘పైగా’ కుటుంబసభ్యుల నుంచి తమ కక్షిదారుల పూర్వీకులు కొనుగోలు చేశారని, ఆ భూముల విషయంలో అధికారులు జోక్యం చేసుకోకుండా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు ముగిసిన అనంతరం తీర్పును వాయిదా వేస్తున్నట్టు హైకోర్టు ప్రకటించింది.