ములుగు : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి (Rahul gandhi) వ్యతిరేకంగా ములుగులో (Mulugu) నిరసన వ్యక్తమవుతున్నది. రాహుల్ గాంధీ రాకను నిరసిస్తూ ములుగులో పోస్టర్లు (Posters) వెలిశాయి. గిరిజన యూనివర్సిటీ గురించి పార్లమెంట్లో ఏనాడు మాట్లాడలేదని, రామప్ప అభివృద్ధి నిధుల గురించి ఏనాడు కూడా కేంద్రాన్ని అడగలేదని, పార్లమెంట్లో ప్రస్తావించలేదు.
వనదేవతలైన మేడారం, సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ హోదా గురించి మాట్లాడని రాహుల్ గాంధీ, ఇప్పుడు ఎన్నికలు రాగానే.. ఓట్ల కోసం పరుగెత్తుకుంటూ వచ్చాడని రాహుల్ గాంధీ ఫొటోతో పోస్టర్లు వెలిశాయి. కాంగ్రెస్ పార్టీతో విసిగిపోయి ప్రజలే పోస్టర్లు వేసినట్టుగా సమాచారం. కాగా, పోస్టర్లు చూసి రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ తీరుపై ‘ఓట్ల వేటగాళ్లు అవసరమా మనకు’ అంటూ చర్చించుకుంటున్నట్లు సమాచారం.