తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొదటగా పోస్టల్, సర్వీస్ ఓట్లను లెక్కిస్తున్నారు. 25 చొప్పున బ్యాలెట్లను కట్టలు కట్టి కౌంటింగ్ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2.20 లక్షల పోస్టల్ బ్యాలెట్లు పోలయ్యాయి. అనంతరం ఈవీఎం ఓట్లను లెక్కించనున్నారు.
మొత్తం 49 ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు కోసం 119 స్థానాల్లో 1798 టేబుళ్లు ఏర్పాటు చేశారు. మొత్తం 2417 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మొదటి ఆధిక్యం ఉదయం 10.30 గంటలకు వస్తుంది. అదేవిధంగా చిన్న నియోజకవర్గాల్లో 10.30 గంటలకే తొలిరౌండ్ ఫలితాలు రానున్నాయి.