ముంబై: ఇండియన్ మెన్స్, వుమెన్స్ క్రికెట్ టీమ్కు యూకే గుడ్న్యూస్ చెప్పింది. తమ దేశంలో సుదీర్ఘ పర్యటనకు రానున్న రెండు టీమ్ల ప్లేయర్స్ తమ ఫ్యామిలీలతో కలిసి వచ్చేందుకు అనుమతి ఇచ్చింది. ఇండియన్ మెన్స్ టీమ్ ఇంగ్లండ్లో నాలుగు నెలలు గడపనుంది. వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్తోపాటు ఇంగ్లండ్తో ఐదు టెస్ట్ల సిరీస్ ఆడాల్సి ఉంది. అటు వుమెన్స్ టీమ్ కూడా ఇంగ్లండ్ టీమ్తో ఒక టెస్ట్, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది.
పురుషులు, మహిళల జట్లు రెండూ ఒకే చార్టర్ విమానంలో ఇంగ్లండ్ వెళ్లనున్నాయి. ఈ నెల 3న లండన్లో ఈ ఫ్లైట్ ల్యాండవనుంది. అక్కడి నుంచి డబ్ల్యూటీసీ ఫైనల్ జరిగే సౌథాంప్టన్కు మెన్స్ టీమ్ వెళ్లనుండగా.. ఏకైక టెస్ట్ జరిగే బ్రిస్టల్కు వుమెన్స్ టీమ్ వెళ్లనుంది. యూకేలో దిగిన తర్వాత మరో 10 రోజుల పాటు తప్పనిసరి క్వారంటైన్లో ఈ రెండు టీమ్స్ ఉండాలి.
పైగా అందరు ప్లేయర్స్, వాళ్ల కుటుంబ సభ్యులు నెగటివ్ ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ ఫలితాన్ని కచ్చితంగా చూపించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ రెండు టీమ్ల ప్లేయర్స్ ముంబైలోని ఒకే హోటల్లో క్వారంటైన్లో ఉంటున్నారు. నిజానికి ఇండియా నుంచి ప్రయాణాలపై నిషేధం ఉన్నా.. క్రికెట్ మ్యాచ్ల కోసం యూకే ప్రభుత్వం ప్లేయర్స్కు సడలింపులు ఇచ్చినట్లు ఐసీసీ వెల్లడించింది. అయితే టీమ్స్ మాత్రం కచ్చితంగా అక్కడి కొవిడ్ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.
అక్కడ క్వారంటైన్లో ఉన్న సమయంలోనూ రెగ్యులర్గా ప్లేయర్స్కు కరోనా టెస్టులు నిర్వహించనున్నారు. మొదట్లో ప్లేయర్స్ను చిన్న చిన్న గ్రూపులుగా విడదీసి ప్రాక్టీస్కు అనుమతించనున్నారు. జూన్ 18 నుంచి న్యూజిలాండ్తో వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్లో టీమిండియా తలపడనున్న విషయం తెలిసిందే.