జనగామ, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): జనగామ జిల్లా కేంద్రంలో గురువారం రాత్రి బీజేపీ నిర్వహించిన బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర జనం లేక వెలవెలబోయింది. పొరుగు రాష్ర్టాల కూలీలకు డబ్బుల్చి కొందరిని తీసుకొచ్చినా.. భారీ బహిరంగసభ అంటూ ప్రచారం చేసి జనాలను తరలించేందు గ్రామాలకు వాహనాలు పంపి బతిమిలాడినా స్వల్పంగా వచ్చిన సభ్యులతో సభ చప్పగా సాగింది.
పెద్దఎత్తున మొహరించిన పోలీసు బలగాలు.. మీడియా హడావుడి..నాయకుల హంగామా.. తప్ప సభకు స్వచ్ఛందంగా తరలివచ్చిన జనం కనిపించలేదు. కేసీఆర్ పాలన, పాలసీని, సంక్షేమ పథకాలను విమర్శించిన బండి చప్పుట్లు కొట్టాలని జనాన్ని కోరినా వారి నుంచి స్పందన రాలేదు.