హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం టీఎస్ ఆర్టీసీకి రూ.375 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ మేరకు రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. జీవో 61 ద్వారా రూ.212.50 కోట్లు, జీవో 62 ద్వారా రూ.162.50 కోట్లను మంజూరు చేశారు.