హైదరాబాద్ : ఆరుగాలం కష్టపడి శ్రమించిన రైతులు (Farmers) పంటలను అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రాల దగ్గర ఇంకా ఎన్ని రోజులు పడిగాపులు కాయాలని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య(Ponnala Lakshmaiah) అన్నారు. మంగళవారం బీఆర్ఎస్ భవన్లో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు(Grain Purchase) కేంద్రాలు మొదలుపెట్టి ఇప్పటికి 20 రోజులు అవుతుంది. 20 రోజుల్లో 2.7 లక్షల టన్నుల ధాన్యం కొంటే, 34 లక్షల టన్నుల ధాన్యం కొనడానికి ఎన్ని రోజుల సమయం పడుతుందని ప్రశ్నించారు.
ఇదే సగటున కొంటె మొత్తం ధాన్యం కొనటానికి 200 రోజులు పడుతంది. అప్పటివరకు అందరు రైతులు కేంద్రాల దగ్గర ఉండాలా? అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి అధికార దుర్వినియోగం చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉండగా మాట్లాడినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. అధికార పార్టీ ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసే ఎత్తుగడలకు పాల్పడుతున్నది. ఫోన్ ట్యాపింగ్ పై లీకులతో కాలక్షేపం చేస్తూ ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదని విమర్శించారు.