ములుగు, ఫిబ్రవరి28 (నమస్తే తెలంగాణ)/తాడ్వాయి: రాష్ట్రంలో దేవాలయాలను అభివృద్ధి చేసే క్రమంలో బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని ఆలయాలను అభివృద్ధి చేయనున్నట్టు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ధనసరి అనసూయ సీతక్క పేర్కొన్నారు.
శనివారం ములుగు జిల్లా మేడారంలో పర్యటించిన వారు తల్లులను దర్శించుకొని అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. జంపన్నవాగులో నీరు ప్రవహించేలా చెక్డ్యామ్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వివరించారు.