ఖమ్మం/వేలేరు, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): శాసనసభ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నాలకు ఫ్లయింగ్ స్కాడ్, టాస్క్ఫోర్స్ అధికారులు చెక్ పెట్టారు. మాజీ ఎంపీ, కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కమిటీ కో-కన్వీనర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీప బంధువు, ఖమ్మంలోని దయాకర్రెడ్డి ఇంట్లో బుధవారం దాడులు చేశారు.
రూ.46.89 లక్షల విలువ చేసే రూ.9,570 గోడ గడియారాలను అధికారులు సీజ్ చేశారని, ఆధారాలు చూపిస్తే వాటిని రిలీజ్ చేస్తామని ఫ్లయింగ్ స్కాడ్ అధికారి సుమ తెలిపారు. దయాకర్రెడ్డి ఇంట్లో పెద్ద ఎత్తున గడియారాలు దొరకడం రాజకీయంగా కలకలం రేపుతున్నది. కాగా.. ఆ గడియారాలపై పొంగులేటి ఫొటోతోపాటు తన కూతురు వివాహం సందర్భంగా.. అని ముద్రించి ఉం డటం పలు అనుమానాలకు తావిస్తున్నది.