నిజామాబాద్: నిజామాబాద్ పట్టణంలో ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపింది. ఆదివారం సాయంత్రం ప్రైవేటు హాస్టల్ పైనుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన అక్షిత నిజామాబాద్ సమీపంలోని విజయ్ ఇంజనీరింగ్ కళాశాలలో పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నది. తాను ఉంటున్న హాస్టల్ పైనుంచి దూకింది. గుర్తించిన హాస్టల్ సిబ్బంది ఆమెను హుటాహుటిన నగరంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆమె మృతిచెందింది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విద్యార్థిని మృతి గల కారణాలు తెలియాల్సి ఉంది.