హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల పరిధిలో బుధవారం పోలింగ్ జరుగనున్నది. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రక్రియ ప్రారంభంకానున్నది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తిచేసింది. బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం కానున్న పట్టణ ఓటరు తీర్పు.. ఈ నెల 13న ఓట్ల లెక్కింపుతో వెల్లడికానున్నది. ఆ రోజే నగర, పట్టణ ప్రజానీకం ఎవరి వైపు మొగ్గు చూపిందనే ఉతంఠకు తెరపడనున్నది. జిల్లాలవారీగా ఏర్పాటుచేసిన పంపిణీ కేంద్రాల నుంచి బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామగ్రిని ఆయా పోలింగ్ కేంద్రాలకు మంగళవారం నుంచి తరలించనున్నారు. ఎన్నికల సిబ్బంది ఇప్పటికే తమకు కేటాయించిన కేంద్రాలకు వాహనాల్లో వెళ్తారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.
బ్యాలెట్ బాక్సుల తరలింపు
బ్యాలెట్ బాక్సులు, పత్రాలను పోలీస్ భద్రత నడుమ స్ట్రాంగ్ రూమ్ల నుంచి రాష్ట్రంలోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు ఎన్నికల అధికారులు తరలించారు. అక్కడి నుంచి మంగళవారం ప్రతి పోలింగ్ కేంద్రానికి తరలిస్తారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు రాష్ట్రవ్యాప్తంగా వేల సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి అకడ సీసీ కెమెరాలు, వెబ్ కాస్టింగ్ సౌకర్యం కల్పించారు. ఓటర్లు ఎన్నికల సంఘం సూచించిన 12 రకాల గు ర్తింపు పత్రాల్లో ఏదైనా ఒకటి వెంట తెచ్చుకోవాల్సి ఉంటుంది.
ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష
రాష్ట్రంలో ఈ నెల 11న జరుగనున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సాధారణ ఎన్నికల ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హైదరాబాద్ ఏసీ గార్డ్స్లోని ఎస్ఈసీ ప్రధాన కార్యాలయం నుంచి అన్ని జిల్లాల ఎన్నికల పరిశీలకులతోపాటు, ము ఖ్యంగా తొమ్మిది జిల్లాల (మెదక్, సిద్దిపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, రంగారెడ్డి, ము లుగు, నిర్మల్) కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో సమీక్ష నిర్వహించారు. పోలింగ్ ప్రక్రియ కోసం సిబ్బం ది నియామకం, వారికి అందించిన శిక్షణపై సమీక్షించారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. సమావేశంలో అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మహేశ్ భగవత్ పాల్గొన్నారు.
అంకెల్లో పురపోరు
ఎన్నికల సిబ్బంది
123 యూఎల్బీల్లోని 2,996 వార్డుల రిజర్వేషన్లు ఇలా..
పార్టీలవారీగా బరిలో నిలిచిన అభ్యర్థుల సంఖ్య