ఇల్లందు: భద్రాద్రి కొత్తగూడెం జల్లా ఇల్లందు (Yellandu) మున్సిపల్ ఆఫీస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మున్సిపల్ చైర్మన్పై అవిశ్వాసం కోసం పాలకవర్గం ప్రత్యేకంగా సమావేశమైంది. చైర్మన్ దుమ్మాలపాటి వెంకటేశ్వరారావుపై ప్రవేశపెట్టిన అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేయడానికి 17 మంది కౌన్సిలర్లు అక్కడికి చేరుకున్నారు. మరో ఇద్దరు కౌన్సిలర్లు మద్దతు తెలిపితే అవిశ్వాసం వీగిపోనుంది. ఈ నేపథ్యంలో కౌన్సిలర్ నాగేశ్వరరావును కాంగ్రెస్ ఎమ్మెల్యే కోరం కనకయ్య బలవంతంగా తీసుకెళ్లగా, సీపీఐ కౌన్సిలర్ను ఆ పార్టీ నాయులు తమవెంట తీసుకెళ్లారు. మున్సిపల్ కార్యాలయానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యాకర్తలు భారీగా చేరుకోవడంతో అక్కడ తీవ్ర ఉద్రక్తత ఏర్పడింది.
అయితే హైకోర్టు ఆదేశాలను లెక్కచేయకుండా పోలీసులు ఓవరాక్షన్ చేస్తున్నారని నేతలు మండిపడుతున్నారు. అధికారిక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు 144 సెక్షన్ వర్తించినట్లు పోలీసులు ప్రవర్తిస్తుండటంపై బీఆర్ఎస్ కార్యకర్తలు ఫైర్ అయ్యారు. సీపీఐ, కాంగ్రెస్ కౌన్సిలర్లను తీసుకెళ్తుంగా అడ్డుకోవడంతో.. రెచ్చిపోయిన హస్తం పార్టీ కార్యకర్తలు ఎంపీడీవో కార్యాలయంపై దాడి చేశారు. అద్దాలను ధ్వంసం చేశారు. ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు.