Harish Rao | పోలీసు నిర్బంధాలు, అణిచివేత చర్యల మధ్య వికారాబాద్ జిల్లా పరిగి రైతుల వద్దకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు బయల్దేరారు. మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర రెడ్డి, దివాకర్ రావు, మాజీ చైర్మన్ ఎర్రోళ్ల దయాకర్రావుతో కలిసి ఆయన పరిగికి బయల్దేరారు. ఈ క్రమంలో మార్గమధ్యలో అప్పా జంక్షన్ వద్ద వారిని పోలీసులు అడ్డుకున్నారు.
పరిగికి చేరుకోకుండా హరీశ్రావును పోలీసులు అడ్డుకున్నారు. హరీశ్రావు కాన్వాయ్ ముందుకు వెళ్లకుండా లారీలను రోడ్డుకు అడ్డంగా పెట్టారు. రైతులకు భరోసాగా వెళ్తున్న హరీశ్రావును అరెస్టు చేసేందుకు యత్నించారు. అయితే పోలీసుల తీరును బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ క్రమంలో పోలీసులు, బీఆర్ఎస్ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. బీఆర్ఎస్ శ్రేణులు రోడ్డుపై బైఠాయించిన ఆందోళన చేపట్టారు. దీంతో అప్పా జంక్షన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది.
పరిగి పర్యటనకు బయల్దేరిన మాజీ మంత్రి @BRSHarish గారిని మార్గమధ్యంలో అప్ప జంక్షన్ అడ్డుకున్న పోలీసులు.
వికారాబాద్ జిల్లా పరిగికి చేరుకోకుండా పోలీసుల అడ్డగింత.
రైతులకు భరోసాగా వెళ్తున్న హరీశ్ రావును అరెస్ట్ చేసేందుకు పోలీసుల యత్నం.పోలీసుల తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న… pic.twitter.com/OeObZ1Cbh6
— Office of Harish Rao (@HarishRaoOffice) April 7, 2026
పోలీసు నిర్బంధాలు, అణిచివేత చర్యల మధ్య పరిగి రైతుల వద్దకు బయల్దేరిన మాజీ మంత్రి @BRSHarish గారు
హరీశ్ రావు గారి వెంట బయల్దేరిన మాజీ మంత్రులు @BrsSabithaIndra గారు, @EDRBRS గారు, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర రెడ్డి గారు, దివాకర్ రావు గారు, మాజీ చైర్మన్ @DrErrolla గారు,… pic.twitter.com/5Jgspji7vx
— Office of Harish Rao (@HarishRaoOffice) April 7, 2026