హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): ఈనెల 26న ఎస్సీటీ ఎస్సై (పీటీవో) టెక్నికల్ పేపర్ పరీక్షను హైదరాబాద్లోని పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నట్టు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. 26న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ పరీక్ష జరుగుతుందని పేర్కొన్నది.
అభ్యర్థులు ఈ నెల 21న ఉదయం 8 గంటల నుంచి 24న అర్ధరాత్రి 12 గంటల వరకు www.tslprb.in వెబ్సైట్ నుంచి హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని, ఇబ్బందులుంటే support@tslprb.inకు ఈ-మెయిల్ కానీ, 93937 11110, 93910 05006 నంబర్లలో సంప్రదించాలని బోర్డు కోరింది. అభ్యర్థులు తప్పనిసరిగా హాల్టికెట్పై తమ పాస్ఫొటోను జతచేయాలని, లేకుంటే పరీక్షకు అనుమతించబోమని పేర్కొన్నది. మిగతా రెండు పరీక్షల తేదీలు, ఇతర వివరాలను త్వరలోనే తెలియజేస్తామని తెలిపింది. రిక్రూట్మెంట్ ప్రక్రియ ముగిసేవరకూ హాల్ టికెట్లను భద్రపర్చాలని కోరింది.