హైదరాబాద్: నగరంలోని కౌకుర్ దర్గా వద్ద భారీగా గంజాయి (ganja) పట్టుబడింది. మల్కాజిగిరి పరిధిలో ఉన్న కౌకుర్ దర్గా వద్ద రెండు ద్విచక్ర వాహనాల్లో తరలిస్తున్న 450 కిలోల గంజాయిని ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విలువ రూ.కోటికిపైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. గంజాయిని తరలిస్తున్న నులుగురిని అదుపులోకి తీసుకున్నారు. బైకులను సీజ్ చేశారు. నిందితులపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి తీసుకెళ్తున్నారనే విషయాలను తెలుసుకుంటున్నారు.