నల్లగొండ : ఖాళీ టమాటా ట్రేల మధ్య గంజాయి(Ganja)ని మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న 330కిలోల గంజాయిని నాగార్జున సాగర్(Nagarjuna sagar)లో ఆదివారం అర్ధరాత్రి పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివవరాల ప్రకారం.. గంజాయిని తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు నాగార్జునసాగర్, ఎపీ సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఓ డీసీఎం వ్యాన్లో ఖాళీ టమాటా ట్రేల మధ్య గంజాయిని తరలిస్తుండగా 168 ప్యాకెట్ల గంజాయిని పట్టుకున్నారు. నలుగురు నింది తులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.