కొత్తగూడెం క్రైం, మే 22: మావోయిస్టుల భారీ వ్యూహాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు భగ్నం చేశారు. భారీగా పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నా రు. సోమవారం ఎస్పీ వినీత్ గంగన్న మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం.. దు మ్ముగూడెం మండలం ములకనపల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారనే విశ్వసనీయ సమాచారంతో పోలీసులు, సీఆర్పీఎఫ్ 141 బెటాలియన్, స్పెషల్ పార్టీ భద్రతా బలగాల సంయుక్త ఆధ్వర్యంలో కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించారు.
ఈ క్రమంలో పదిమంది వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకొని విచారించారు. ఈ విచారణలో సదరు వ్యక్తులు మావోయిస్టు పార్టీ కొరియర్లుగా తేలింది. వీరి వద్ద నుంచి 90 కార్డెక్స్ వైర్ బండిళ్లు, 500 డిటోనేటర్లు, 600 స్లర్రీ స్టిక్స్, బొలెరో వాహ నం, ట్రాక్టర్, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనపరుచుకున్నట్టు ఎస్పీ వినీత్ తెలిపా రు. సదరు కొరియర్లు నిషేధిత మావోయిస్టు పార్టీ అగ్రనాయకుల ఆదేశాల మేరకు పోలీ సు క్యాంపులు, కూంబింగ్ నిర్వహించే భద్ర తా బలగాలపై దాడులు నిర్వహించేందుకు అవసరమైన ల్యాండ్మైన్లు, ఐఈడీలు, రాకె ట్ లాంచర్ల తయారీకి ఉపయోగించే పేలుడు పదార్థాలను తరలిస్తున్నట్టు ఎస్పీ తెలిపారు.